సొమ్మొకడిది సోకొకడిది

కేంద్ర మంత్రి వర్గంలో ఆంధ్రాకి మరలా అన్యాయం. ఇది వరుసగా రెండో సారి మన రాష్ట్రానికి జరుగుతున్న పరాభవం.

సీట్లు మన వాళ్ళవి. పదవులు దేశంలోని మిగిలిన అన్ని ప్రాంతాల వారివి. ఎంత అన్యాయం. ఇంతకన్నా దారుణమయిన ట్రీట్మెంట్ మరే ఇతర రాష్ట్రానికీ దక్కలేదు. ముప్పై మూడు మంది యంపీలను పంపినా కూడా మన రాష్ట్రం పైన కొంత కూడా కృతజ్ఞతా భావం లేకుండా కాంగ్రెస్ పార్టీ వారు ప్రవర్తిస్తున్నారు.తెలుగుదేశం పార్టీ పెట్టిన వెంటనే ప్రజలు బ్రహ్మరథం పట్టడానికి ఇటువంటి చర్యలే కారణం.

రాష్ట్ర మంత్రివర్గ కూర్పులో తల దూరచలేదు అనే కృతజ్ఞతా భావంతో వైయస్ ఈ విషయంలో పట్టువిడుపుగా వ్యవహరించినట్లున్నారు. ఆరుగురు యంపిలను పంపిన కర్నాటకకి మనకన్నా ఒక మంత్రి ఎక్కువ. మొదటిసారిగా కేంద్ర మంత్రి అవుతున్నవారు కూడా కాబినెట్ మంత్రి పదవినలన్కరించనున్నారు. మన రాష్ట్రానికి మాత్రం ఒకే ఒక కాబినెట్ మంత్రి, మిగిలిన వారంతా సహాయ మంత్రులు. ఇలాంటి అన్యాయం ఇంకెంత కాలమో?

Posted in |

0 comments: