హైదరాబాద్ బుక్ ట్రస్ట్ Hyderabad Book Trust
Posted On Saturday, July 4, 2009 at at 9:54 AM by MOVIEప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు - డి. ఎన్ ఝా ...పారడాక్స్ అఫ్ ది కౌ ....
ప్రాచీన భారతంలో ఆహారపు అ లవాట్లు
- డి. ఎన్ ఝా ...
మన దేశంలో ఆహారపు అ లవాట్లు ఎప్పుడూ ఒకేలా లేవు. కాలమాన పరిస్థితులను బట్టి, ప్రాంతాలను బట్టి, అవసరాలను బట్టి మారుతూ వచ్చాయి.
ఇప్పటికీ ఒక్కో ప్రాంతంలో ఒకో రకమైన ఆహారపు అ లవాట్లు కనిపిస్తాయి. పశ్చిమ బెంగాల్లో బ్రాహ్మణులు చేపలు తింటారు. చేపలను వాళ్లు ''జలపుష్పాలు''గా పరిగణిస్తారు. అంటే వాళ్ల దృష్టిలో చేపలంటే ఒకరకం సముద్రపు ఆకుకూర లాంటివన్నమాట. అయితే వాళ్లు కూడా ఇతర మాంసాహారం ముట్టుకోరు. కాశ్మీర్లో బ్రాహ్మణులు మరోరకం పాక్షిక మాంసాహారులు. అదేవిధంగా మనదేశంలో చాలా చోట్ల శాఖాహారులు కోడిగుడ్లను శాఖాహారంగా పరిగణించి స్వీకరించడం కనిపిస్తుంది.
ఈ నాడు ఆవు హిందువుల మత చిహ్నంగా మారిపోయింది. పరమ పవిత్రమైన జంతువుగా పూజలందుకుంటోంది. కానీ వేదకాలంలో, ఆతరువాత బ్రాహ్మణ, బ్రాహ్మణేతర సంప్రదాయాల్లో అంత పవిత్రమైనదిగా చూడబడలేదని, ఆకాలంలో ఇతర జంతువులలాగే ఆవులను యజ్ఞ యాగాల్లో బలియిచ్చేవారని, బ్రాహ్మణులు సైతం గోమాంసాన్ని ఆరగించేవారనీ ప్రాచీన గ్రంథాల ఆధారంగా సోదాహరణంగా వివరిస్తారు ప్రొఫెసర్ డి.ఎన్.ఝా.
గోసంరక్షణ ఆహ్వానించదగ్గదే ఆయినా అది శాస్త్రీయ పద్ధతిలో, దేశ కాలమాన పరిస్థితులకు అనుగుణంగా జరగాలి తప్ప పరమత ద్వేషంతోనో, మూఢనమ్మకాలతోనో కాదనీ, ఒక్క ఆవునే ఎందుకు మిగతా జంతువులను మాత్రం ఎందుకు రక్షించకూడదు అంటారాయన. ఆయన రాసిన Paradox of the Cow: Attitudes to Beef Eating in Early India పరిశోధనా గ్రంథం పెద్ద సంచలనమే సృష్టించింది. అయితే చరిత్రను నిష్పాక్షికంగా పరిశోధించాలనే తప్ప ఇందులో ఎవరినీ నొప్పించే ఉద్దేశం లేదంటారాయన.
స్వయంగా శాఖాహారి అయిన ప్రొఫెసర్ ద్విజేంద్ర నారాయణ్ ఝా ఢిల్లీ యూనివర్సిటీలో చరిత్ర బోధకులు. ఆయన సుదీర్ఘ పరిశోధనా పత్రంలోని కొంత భాగాన్ని ఈ చిరుపుస్తకంగా తెలుగులోకి తీసుకురావడం జరిగింది. అందులోంచి కొన్ని వ్యాఖ్యలు:
...గోమాంసం తినే అ లవాటు భారతదేశానికి విదేశాల నుంచి వలస వచ్చినవాళ్ల ద్వారా ముఖ్యంగా ముస్లింల ద్వారా మన దేశానికి సంక్రమించిందనీ, గోమాంస భక్షణని వాళ్లే మనదేశంలో ప్రవేశపెట్టారనీ కొందరు నమ్ముతారు. కానీ యజ్ఞయాగాల్లో గోవధ, గోమాంస భక్షణ అనేది మన దేశంలో చాలా ప్రాచీన కాలంనుంచే వుంది.
...పాకిస్థాన్లోని షిన్ తెగకు చెందిన ముస్లింలు ఇతర ముస్లింల మాదిరిగా పంది పట్ల ఎంత ఏహ్య వైఖరి కనబరుస్తారో ఆవు పట్ల కూడా అంతే ఏహ్య వైఖరి కనబరుస్తారు. వాళ్లు ఆవు మాంసాన్ని కూడా పంది మాంసంలాగే ఏవగించుకుంటారు.
...ప్రాచీన కాలపు హిందూ సాంప్రదాయం ప్రకారం గోమేథ లేదా అశ్వమేధ యాగాల్లో గోవును లేదా గుర్రాన్ని బలి ఇవ్వడం సర్వసాధారణమైన ఆచారంగా వుండేది.
...వేదాలలో మొత్తం 250 రకాల జంతువుల ప్రస్తావన వుంది. వాటిలో 50 రకాల జంతువులు పవిత్రమైన బలికి, మానవ వినియోగానికి అర్హమైనవిగా పేర్కొన్నారు. ''తైత్తరేయ బ్రాహ్మణం''లో వాస్తవానికి ఆవు మన ఆహారం (అథో అన్నం వాయ్ గోవః) అని చాలా స్పష్టంగా పేర్కొనబడింది. ''సుతపథ బ్రాహ్మణం''లో యజ్ఞవల్క్యుడు లేత ఆవు మాంసాన్ని కోరడం గురించిన ప్రస్తావన వుంది.
...ఋగ్వేద కాలంలో చనిపోయిన వ్యక్తి శవాన్ని కప్పేందుకు దళసరి ఆవు కొవ్వును ఉపయోగించేవారు. ఆ వ్యక్తి పరలోక యాత్రకు వాహనంగా ఉపయోగపడేందుకని శవంతో పాటు ఒక ఎద్దును కూడా దహనం చేసేవారు. ఉత్తర క్రియల్లో (దశదిన కర్మ) భాగంగా ఆవునో ఎద్దునో వధించి బ్రాహ్మణులకు విందు యిచ్చేవారు. ఆరోజు సమర్పించే జంతువుల స్థాయిని బట్టి పితృదేవతల సంతృప్తి ఆదారపడి వుంటుందని నమ్మేవారు. (ఋగ్వేదం X.14-18), అధర్వణ వేదం X 11.2, 48)
...మహా భారతంలోని అత్యధిక పాత్రలు మాంసాహారం తినేవే. రంతిదేవుని కథ ఇందుకు పరాకాష్ట. ప్రతిరోజూ ఆయన వంటగదిలో అనేక ఆవులను వధించి బ్రాహ్మణులకు ధాన్యంతో పాటు మాంసం పంచేవారు. రామాయణంలో ఆవుతో సహా వివిధ జంతువులను బలియివ్వడం, తిండి కోసం వధించడం గురించి వాల్మీకి అనేక సందర్భాల్లో ప్రస్తావించాడు.
... యమునా నదిని దాటేటప్పుడు సీత ''రాముడు తన ప్రతిజ్ఞా పాలన పూర్తిచేసిన తరువాత 1000 ఆవులతో , 100 పీపాల మద్యంతో నిన్ను కొలుస్తాను తల్లీ'' అని మొక్కడం గమనించవచ్చు.
... సీతకు దుప్పి మాంసం అంటే చాలా ఇష్టం. అందుకే రాముడు లేడి రూపంలో వున్న మారీచుణ్ని వెంటాడి వేటాడి చంపుతాడు. అట్లాగే భరద్వాజుడు ఒక ఆవుదూడను వధించి రాముడిని ఆహ్వానించిన వైనం కూడా రామాయణంలో కనిపిస్తుంది.
... గౌతమ బుద్ధుడు, మహావీరుడు అహింసా సిదాంతాన్ని ప్రచారం చేశారు. వైదిక కాలపు జంతుబలిని వారు తీవ్రంగా వ్యతిరేకించారు. అయితే బుద్ధుడు మాంసాహారాన్ని తినకూడదని చెప్పలేదు. బౌద్ధ మతస్థులకు మాంసాహారం ఆమోదయోగ్యమనేందుకు గ్రంథస్త ఆధారాలు అనేకం వున్నాయి.
... మధ్యయుగపు తొలి రోజుల నుంచే గోవధ, గోమాంస భక్షణ పాపకార్యంగా చూడబడుతోంది.
...హిందూ గో సంరక్షణ ఉద్యమాన్ని మొదలు పెట్టినప్పటి నుంచీ రాజకీయ జన సమీకరణకు ఆవు ఒక సాధనంగా మారింది. 1882లో మొట్టమొదటి గోరక్షిణి సభ ను స్థాపించి స్వామీ దయానంద సరస్వతి అశేష జన బాహుళ్యాన్ని సంఘటిత పరిచేందుకు ఆవును మరింత బలమైన ప్రతీకగా తీర్చిదిద్దాడు. 1880లలో, 1890లలో ముస్లింల గోవధను ఎదిరించడం, తత్ఫలితంగా మతకలహాలు చెలరేగడం అనేక సార్లు జరిగింది. 1966లో జాతీయ స్థాయిలో గోవధను నిషేధించాలన్న డిమాండుతో అన్ని మతతత్వ పార్టీలు పార్లమెంటు ముందు భారీ ప్రదర్శనలు నిర్వహించాయి. 1979లో ఆచార్య వినోభా భావే దేశ వ్యాప్తంగా గోవధను నిషేధించాలని కోరుతూ ఆమరణ నిరాహార దీక్షకు కూచున్నారు. అప్పటి ప్రధాని మొరార్జీ దేశాయ్ చట్టం తెచ్చేందుకు ప్రయత్నిస్తానని అస్పష్ట హామీ ఇవ్వడంతో ఆయన దీక్ష విరమించుకున్నారు.
మౌనం *
Posted On at at 9:52 AM by MOVIE
లోకి అడుగు పెట్టాడు హర్ష .
ఓ వృద్ధస్వామి,అతన్ని లోపలికి తీసుకెళ్ళారు,ఆశ్రమ విశేషాలను,విధి విధానాలను వివరించారు .
హర్ష అన్నీ శ్రద్ధ గా విని ,ఆశ్రమంలో ఉండిపోవాలన్న కోరిక వ్యక్తం చేసాడు. దానికి వృద్ధస్వామి
సరేనంటూ , ఉన్నంత కాలం మౌనం గా ఉండాలని , అనుమతి ఇస్తే తప్ప మాట్లాడ కూడదని
చెప్పారు .
హర్ష , హర్షానంద అయ్యాడు .ఆశ్రమం లో రెండేళ్ళు దీక్ష గా గడిచాయి.అప్పుడు రెండు పదాలు
మాట్లాడ టానికి అనుమతి లభించింది .
హర్షానంద చెప్పారు "భోజనం బాలేదు ".తరువాత నుండి చక్కని భోజనం ఏర్పాటు చేయబడింది.
మరో రెండేళ్ళు గడిచాయి , మరో రెండు పదాలు మాట్లాడటానికి అనుమతి లభించింది .
ఈ సారి హర్షానంద అన్నారు "పడక ఇబ్బంది ".ఆ తరువాత మంచి పడక ఏర్పడింది .
ఆరేళ్ళు పూర్తి అయినాయి .పెద్దల అనుమతి తో రెండు పదాలు పలికారు హర్షానంద ,
"ఆశ్రమం వదిలేస్తున్నాను "
విన్న వృద్ధ స్వామి చెప్పారు ,
" నువ్వు ఈ పని ఎప్పుడో చేయవలసింది . వచ్చినప్పటి నుండీ నీ ఇబ్బందుల గురించి
చెప్పటం తప్ప , సాధించింది ఏమీ లేదు.శుభం , వెళ్లిరా నాయనా "
LET'S CELEBRATE HIM: TO మైకేల్ జాక్సన్.
Posted On at at 9:48 AM by MOVIELET'S CELEBRATE HIM: TO మైకేల్ జాక్సన్
Skin head, dead head
Everybody gone bad
Situation, aggravation
Everybody allegation
In the suite, on the news
Everybody dog food
Bang bang, shot dead
Everybody's gone mad
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Beat me, hate me
You can never break me
Will me, thrill me
You can never kill me
Jew me, sue me
Everybody do me
Kick me, kike me
Don't you black or white me
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Tell me what has become of my life
I have a wife and two children who love me
I am the victim of police brutality, now
I'm tired of bein' the victim of hate
You're rapin' me of my pride
Oh, for God's sake
I look to heaven to fulfill its prophecy...
Set me free
Skin head, dead head
Everybody gone bad
trepidation, speculation
Everybody allegation
In the suite, on the news
Everybody dog food
black man, black male
Throw your brother in jail
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Tell me what has become of my rights
Am I invisible because you ignore me?
Your proclamation promised me free liberty, now
I'm tired of bein' the victim of shame
They're throwing me in a class with a bad name
I can't believe this is the land from which I came
You know I do really hate to say it
The government don't wanna see
But if Roosevelt was livin'
He wouldn't let this be, no, no
Skin head, dead head
Everybody gone bad
Situation, speculation
Everybody litigation
Beat me, bash me
You can never trash me
Hit me, kick me
You can never get me
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
Some things in life they just don't wanna see
But if Martin Luther was livin'
He wouldn't let this be
Skin head, dead head
Everybody gone bad
Situation, segregation
Everybody allegation
In the suite, on the news
Everybody dog food
Kick me, strike me
Don't you wrong or right me
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
All I wanna say is that
They don't really care about us
బ్యాంక్ ఉద్యోగాల పై నిరుద్యోగుల ఆశలు
Posted On at at 9:45 AM by MOVIEఇప్పుడు నిరుద్యోగుల ఆశలు బ్యాంక్ ఉద్యోగాల వైపు మరలినాయి. అది కూడా ప్రభుత్వ రంగ బ్యాంక్ ఉద్యోగాల వైపు. ఈ మధ్య నాతో ఒక నిరుద్యోగి తాను బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినట్టు చెప్పాడు. బ్యాంక్ ఆఫ్ ఇండియా జాతీయ బ్యాంకా, ప్రైవేట్ బ్యాంకా అని అడిగాను. జాతీయ బ్యాంకే అని చెప్పాడు. ప్రైవేట్ సంస్థల కంటే ప్రభుత్వ రంగ సంస్థలలోనే ఉద్యోగ భద్రత ఎక్కువ ఉంటుందని, అందుకే తాను పబ్లిక్ సెక్టార్ బ్యాంక్ లో ఉద్యోగానికి అప్లికేషన్ పెట్టినట్టు చెప్పాడు. ప్రపంచ ఆర్థిక సంక్షోభం వల్ల ఐ.టి. రంగం దివాలా తీసింది. ఇప్పుడు కొంత మంది ఇంజినీరింగ్ విధ్యార్థులు కూడా బ్యాంక్ ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్నారు. కొన్ని జాతీయ బ్యాంకులకి గ్రామీణ ప్రాంతాలలో కూడా శాఖలు ఎక్కువ ఉండడం వల్ల గతంలో గ్రామీణ నిరుద్యోగులు బ్యాంక్ ఉద్యోగాల పై ఆశలు పెట్టుకున్నారు. ఇప్పుడు పట్టణ ప్రాంత నిరుద్యోగులు కూడా బ్యాంక్ ఉద్
సూఫీ కవిత్వం - - హాఫీజ్
Posted On at at 9:42 AM by MOVIEఖ్వాజా షామ్సుద్దీన్ మొహమ్మద్ హాఫీజ్ సిరాజి (1315-1390) హాఫీజ్ కవిత్వంలో సౌందర్యం, మార్మికత, ప్రేమ, కరుణ వంటి విశ్వజనీన భావాలు పరిమళిస్తూంటాయి. నిశిత దృష్టి, ఆహ్లాదమైన శైలి, లయ, సరళ భాషతొ ఉండే హాఫీజ్ కవిత్వం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆదరణ పొందింది. మరో పర్షియన్ కవి, అత్తర్ వద్ద హఫీజ్ శిష్యరికం చేసాడు.
ఒక పర్షియన్ కవిగా హాఫీజ్ కు మంచి పేరు ఉంది. అది ఎంతంటే ఈతని పుస్తకాలు, ఖురాను కంటే ఎక్కువగా అమ్ముడు పోయేవట.
భారతదేశపు యోగి శ్రీమెహర్ బాబా , హఫీజ్ గీతాలను పాడేవారట.
హఫీజ్ " అశరీర వాణి" అనీ (Tongue of the Invisible), "కవులకే కవి" అని కీర్తి గడించాడు. దేవునిలో లీనమయ్యే మార్గాలను అన్వేషిస్తూ హఫీజ్ ఎన్నో వందల గీతాలను రచించాడు. హఫీజ్ సుమారు 5000 గీతాలు వ్రాసినట్లు ఒక అంచనా. హఫీజ్ తన గీతాలలో ఎక్కడో ఒక చోట తన పేరును పొందుపరచుకొనే వాడు.
మతపెద్దల ధ్వంధ్వ ప్రవృత్తులను తన వ్రాతలలో విమర్శించినందుకు హఫీజ్ తన చరమాంకంలో రాజదండనకు గురి అయ్యాడని అంటారు.
హాఫీజ్ కొరకు మరింత సమాచారం ఇక్కడ
అమెరికాలో పొగడపూలు
Posted On at at 9:37 AM by MOVIEబినీ బేబీస్
Posted On at at 9:32 AM by MOVIEబినీ బెబీస్
సమ్మర్ సెలవులు అనెసరికి పిల్లలకి కాలక్షెపం కొసంకొసం బొలెడు ప్రొగ్రాములు అనౌన్స్ చెస్తారు,ఫలానాచొట ఫలాన రొజు,ఫలానా టైముకి,ఫలాన పొటీ పిల్లలకి జరుగుతుంది మీ పిల్లలని
తీసుకురావాలంటె రిజిస్టెర్ చెయ్యండి అంటారు. అన్నిటికి మన కంప్యూటర్ మామయ్య వున్నాదుగా,ఆయనకి చెపుతె చెసెస్తాడు."శహనాకి ఇవాళ ""బినీ బెబీస్ "ప్రొగ్రాం వుంది దొడ్డా వెళ్దాము అంది రాధిక.పిల్లని తీసుకువెళ్ళాము. మిల్ వాలీ పబ్లిక్ లైబ్రరీ లొ చిల్డ్రెన్స్ రూంలొ జరిగింది.పిల్లలకొసం కెటాయించిన స్థలం,కొన్ని రూములొనూ కొన్ని వాతావరణం బాగుంటె ఆరు బయట చెస్తారు.బినీబెబీస్ ఆరుబయత చెసారు.సంఫ్రంచిస్చొ లొ రొడ్లన్ని ఎత్తులు పల్లాలు.మెలికలు.ఈ లైబ్రరీ కొండ
మీద చెట్ల మధ్య వుంది.బాగా ఎత్తుగా పైన గుబురుగా వుండె చెట్లు ఒకచొట గుంపుగా పదిమంది నులుచుని తలలు దగ్గర పెట్టి ఎదొ సమస్యని చర్చిస్తున్నట్లుగా వున్నాయి.వాటి నీడ ఇంటికప్పులా చల్లగా వుంది.అక్కడొక రాతి తిన్నెవుంది.అక్కడ జరిగింది. పక్కనె చిన్న సెలయెరు ఉషారుగా పరుగెత్తుతున్నది. మెము వెళ్ళెసరికి ప్రొగ్రాము నడిపె ఆవిడ సామాను తొ సహా సిధ్ధంగా వుంది.రెండున్నర ఎళ్ళ వయసు పిల్లల్ని కూడా తల్లులు తీసుకు వచ్చారు.అందరూ చెరాక పిల్లల్ని గుండ్రంగా కూర్చొ పెట్టి తల్లలు, వెంట వచ్చిన వాళ్ళు వాళ్ళ వెనకె కూర్చున్నారు.అందరూమట్టి నెల మీదే కూర్చున్నారు.ఆ చెట్ల నీడ మధ్య రెండుమూడు సూర్య కిరణాలు "ఎంచెస్తున్నారో? చూద్దాము అన్నట్లుగా దూసుకు వచ్చాయి.
ఒకామె బొమ్మల పుస్తకం తెచ్చి కధ చెప్పింది. చెట్లు కావాలంటె నెల బాగుచెసి,ఎరువు వెయాలి,గింజ నాటాలి,నీరుపొయాలి అని చూపించి చెప్పింది.తరువాత అందరికి టెర్రకొట
కుండీలు బుల్లివి ఇచ్చారు.వాటిమీద రంగులతొ డిజైన్స్ వెయ్యడానికి రంగు పెన్సిల్స్ ఇచ్చారు,అంటైంచ డానికి ఒక స్టిక్కెర్ ఇచ్చారు. పిల్లలు గబగబా రంగులు పూసెసారు,వాల్ల పెర్లు కుండీపై వ్రాయమన్నారు, వ్రాసెసారు.పిల్లలు పెయింట్ చెస్తూంటె తల్లులు ఆనంద పడిపొయారు,పిల్లలకి గర్వం చెసామని. తరువాత పిల్లలందరిని పొట్స్ తీసుకొని లైనుగా నిలబడమన్నారు.బుధ్ధిగా నుంచున్నారు.అప్పుదు వాళ్ళ కుండీలలొ ఒకావిడ మట్టిపొసింది,వాళ్ళెతెచ్చారు.మరో ఆవిడ బీన్స్ గింజ దానిలొ నాటింది,మరొ ఆవిడ నీళ్ళు పొసింది..ప్రింట్ చెసిన కార్డ్ ఒకటి ఇచ్చారు,దానిపై"చెట్లుపెంచాలంటెకొంచెం మట్టి,ఒక గింజ,కాసిని నీళ్ళు,కాస్త ఎండ,కాస్త ప్రెమ కావాలని వ్రాసారు.
ఇది అయిపొగానె పిల్ల లందరూ పొలో మంటూ నీళ్ళ దగ్గరికి పరుగ్ర్తారు,తల్లులు కాసెపు నీళ్ళతొ ఆడాక పక్కనున్న లైబ్రరీకి వెళ్ళాము.పెద్దపెద్ద అద్దాల కిటికీలున్న హాలుల్లొ లైబ్రరీ విసాలంగావుంది.బయటికి చూస్తె అందమైన ప్రక్రుతి.నిస్సబ్దం.అందరూ లాప్ తాప్లు తెచ్చుకొని కాఫీతాగుతూ చదువు కొంటున్నారు.లెఖ్ఖ లెనన్ని పుస్తకాలు.చిన్న జీవితం.జన్మంతా వెచ్చించినా
వాటి పేర్లుకూడా చదవలెమోమో?అనిపించింది.పిల్లలు తయారు చెసిన బొమ్మలతొ ఆవిభాగం అంతా అలంకరించారు.లైబ్రరీ వాళ్ళు బూక్ మార్కెలు ప్రింట్ చెసెందుకు బొమ్మలకొసం పిల్లలకి పొటీ పెద్తారట. ఫష్ట్ వచ్చిన వారి బొమ్మ తీసుకు చార్డ్ తయారు చెసి బొమ్మ వెసిన వారి పెరు,వయస్సు
వెస్తారు.ఇలాటివి ఎంతొ ప్రొత్సాహాన్నిస్తాయి.
రాధిక వాళ్ళతొ మెము ఇండియా వెల్తున్నాము వచ్చాక కలుస్తామని చెప్పింది. వాళ్ళు సహనాకి
ఒక తెల్లకాగితాల బూక్,పెంచిల్ ఇచ్చారు,అక్కడి విషెషాలు వ్రాయమని చెప్పారు.వాళ్ళకి ఉత్తరాలు వ్రాయమని కవర్లు,కాగితాలు,స్టాంపులు ఇచ్చారు.ఒకషీటుపై లైన్లు వెసివున్నాయి.రొజు 20 నిముషాలు పుస్తకం చదవాలి,చదివి అందులొ నొతె చెయ్యాలి. ఆకడినుంచి వ్రాసిన ఉత్తరాలు బాగుంటె లైబ్రరీలొ డిస్ప్లె చెస్తారట.చిన్నపిల్లల విభాగంలొ కూడా పెద్ద డిక్ష్నరీలు ఉన్నాయి,పిల్లకి వెరె వున్నాయి.పుస్తకాలు,డ్వ్డ్లు ఇంటికి ఇస్తారు,ఫ్రీగా.పిల్లలు పుస్తాకాలు చదివె అలవాటు పెంచడానికి తల్లులు కూడా శ్రమ్ పడతారు.చిన్నపిల్లల్ని తీసుకు వచి పుస్తకాలు చదివి వినిపిస్తారు. చక్కటి వాతావరణంలొ అక్కడకూర్చుని పుస్తకాలు చదువుకొవాలనిపించింది.